భారతదేశ జాతీయ గీతమైన “వందేమాతరం” ఆలపింపబడిన 150 సంవత్సరాలు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కా నాగేశ్వరరావు : (నవంబర్ 8 2025) వందేమాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా ఈ రోజు, 07-11-2025, భారతదేశ జాతీయ గీతమైన “వందేమాతరం” ఆలపింపబడిన 150 సంవత్సరాల స్మరణార్థంగా, నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నందిగామ పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది, అధికారుల సమక్షంలో వందేమాతర గీతాన్ని ఘనంగా ఆలపించడం జరిగింది. భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రేరణనిచ్చిన ఈ గీతం జాతీయ చైతన్యానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచినదని ఈ సందర్భంగా సిబ్బందికి వివరించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రసంగిస్తూ, “వందేమాతరం” గీతం భారతీయుల హృదయాలలో దేశప్రేమ జ్యోతిని వెలిగించిన మహత్తర గీతమని, దీని 150వ వార్షికోత్సవం ప్రతి భారతీయుని గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. ఆయన అందరికీ జాతీయ గౌరవాన్ని, ఏకత్వాన్ని కాపాడే సంకల్పం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, సివిల్ సిబ్బంది పాల్గొని, వందేమాతర గీతాన్ని సమూహంగా ఆలపించారు. అనంతరం దేశభక్తి భావనతో నిండిన నినాదాలు వినిపించాయి. ఈ సందర్భంగా భారత జాతీయ గీత రచయిత బ్యాంకిమ్‌చంద్ర చటర్జీ స్మృతిని గౌరవిస్తూ, ఆయన దేశానికి అందించిన ప్రేరణాత్మక రచనకు స్మరణ నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *