తుంగతుర్తి మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయ గేయమైన వందేమాతరం ను రచించి 150 సంవత్సరాల వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7: తుంగతుర్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి దస్తగీర్ : తుంగతుర్తిలో విద్యార్థులతో భారీ ర్యాలీ భారత జాతీయ గేయమైన వందేమాతరం, ను రచించి నేటికీ 150 సంవత్సరాలు నిర్వహించి శుక్రవారం తుంగతుర్తి మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై విద్యార్థులచే జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ వద్ద సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ మేరకు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో వందేమాతరం గేయం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి సామాన్యులను సమరయోధులుగా మార్చి ఉన్నారు. ఈయాన్ని గేయాన్ని బంకించంద్ర చటర్జీ నవంబర్ 7న 1875లో వ్రాశారని అన్నారు. ఈ గేయం అహింసాయుత భారత స్వాతంత్రోద్యమంలో రణ నినాదంగా ఉపయోగపడే ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానంద్, జిల్లా పరిషత్ తుంగతుర్తి వ్యాయామం ఉపాధ్యాయులు యాకయ్య, శ్రీ విద్యా భారతి పాఠశాల ఉపాధ్యాయులు అంబటి రమేష్, సురేష్ స్థానిక ఎస్సై ఆర్ క్రాంతి కుమార్, తో పాటు పాఠశాల విద్యార్థులు పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *