శివనామస్మరణతో మోగిన శివాలయాలు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 తిరుమలగిరి మండల రిపోర్టర్ శ్రీనివాస్ తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామాలలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుండే అలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేస్తూ పుణ్యం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల వ్యాప్తంగా ఉన్న శివాలయాలు లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *