ఆపదలో ఆపద్బాంధవులు

★ మిత్రమండలి ట్రస్ట్ సభ్యులు

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 5 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా మణుగూరు మండలం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన శెట్టి వెంకట నరసమ్మ 80 సంవత్సరాలు అనారోగ్యంతో మరణించారు ఇది తెలిసి. మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ స్పందించి ట్రస్ట్ ద్వారా శెట్టి వెంకట నరసమ్మ కుటుంబ సభ్యులకు 3000/- రూపాయలు దహన సంస్కరాల కోసం అందచెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు. ట్రస్ట్ సభ్యులు పి జగన్ మోహన్, అమ్ములు శ్రీనివాస్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు