మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

★మిత్రమండలి ట్రస్టు సభ్యులు

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 5, మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ రాజేష్ ఖన్న:
మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పివి కాలనీ ప్రాంతానికి చెందిన చీమల పద్మ 70 సంవత్సరాలు అనారోగ్యంతో మరణించారు ఇది తెలిసి. మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ స్పందించి ట్రస్ట్ ద్వారా చీమల పద్మ కుటుంబ సభ్యులకు 3000/- రూపాయలు దహన సంస్కరాల కోసం అందచెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు. ట్రస్ట్ సభ్యులు. పి జగన్ మోహన్, తమ్మిశెట్టి వాసు, అమ్ములు శ్రీనివాస్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.