జన్నారం మండలంలో తరచు ప్రమాదములు

*లారీ అతివేగంగా వచ్చి బైకును గుద్దింది చింతగూడ ప్రధాన రహదారి పైన

సాక్షి డిజిటల్ న్యూస్. నవంబర్ 4. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలం ప్రధాన రహదారి అంతర్రాష్ట్ర రహదారిగా ఉండి పలు జిల్లాలకు మధ్యస్థంగా ఉండడంతో భారీ వాహనాలు అయిన లారీలు ఇసుక రాడు కంకర తో పాటు ఫ్లై ఆష్ బూడిద లారీలు వాణిజ్య వ్యాపార భారీ వాహనాలు నిత్యం వేలాదిగా దుమ్ముమయం చేస్తూ రోడ్డుపై విపరీతమైన స్పీడుతో భయాందోళన కలిగించే విధంగా ప్రయాణం గత రెండు నెలలుగా కొనసాగుతుంది ఏదో ఒకచోట మండల వాసులతో పాటు పక్క మండలాలు పక్క జిల్లాల వారికి ప్రమాదాలు జరిగిన సంఘటనలుగా ఉన్నాయి జన్నారం మండలం లోని చింతగూడెం గ్రామ ముఖ ద్వారం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఉదయం 9 గంటలకు సుమారు అతివేగంగా వస్తున్న లారీ బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుద్దడంతో ఒక వ్యక్తి సంఘటన స్థలంలో మరణించినట్లు మరో వ్యక్తి కాళ్లు చేతు విరిగి తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో జన్నారం మండలం పోలీస్ బృందం చేరుకొని సహాయక చర్యలు చేపట్టి గాయాలైన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు 108 లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *