వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి

*ప్రభుత్వ వైద్య కళాశాలలో వైట్ కోట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :4 ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలోనూతన వైద్య విద్యార్థులు (MBBS) వైద్య వృత్తిలో అడుగుపెట్టిన సందర్భంగా వైట్ కోట్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక అని ఇది కేవలం ఉద్యోగం కాదు ఇది సమాజానికి అంకితమైన పవిత్ర బాధ్యత అన్నారు. వైద్య విద్యార్థులు రోగుల పట్ల కరుణ సహానుభూతి అంకితభావం కలిగి పనిచేయాలి అని తెలిపారు. మీ చేతుల్లో సమాజ ఆరోగ్య భవిష్యత్తు ఉంటుందని అత్యున్నత వైద్య నైతిక ప్రమాణాలను పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి వైద్యుడి ధర్మం అని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణలో యువ వైద్యుల పాత్ర ఎంతో కీలకం అన్నారు. మీరు రాబోయే రోజుల్లో దేశ వైద్య రంగానికి మూల స్తంభాలు అని ఈ దశలోనే మీరు క్రమశిక్షణ సమయపాలన మానవతా దృక్పథం ప్రజల పట్ల బాధ్యత వంటి విలువలను ఆచరించాలి అని నూతన విద్యార్థులకు సూచించారు. వైద్యునిగా సమాజానికి మీరు చేసే సేవే మీ గొప్పతనం. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు రోగులు అందరికీ ఈ వైట్ కోట్ కేవలం వస్త్రం కాదు ఇది నైతికత సేవ నిబద్ధతలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైద్య నైతిక ప్రమాణాల పట్ల నిబద్ధత వ్యక్తం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు.అనంతరం 150 మంది నూతన వైద్య విద్యార్థులకు కలెక్టర్ చేతులు మీదుగా తెల్లకోటును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీహరి రావు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రాధామోహన్ వైద్య కళాశాల అధ్యాపకులు సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *