నవంబర్ 4 సాక్షి డిజిటల్ న్యూస్ భూపాల్ పల్లి సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడం, సమస్యలను నేరుగా విని వెంటనే పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన 44 మంది దరఖాస్తుదారులతో కలెక్టర్, మీ సమస్య చెప్పండని అడిగి తెలుసుకుని దరఖాస్తు పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని,
అవసరమైతే ఫీల్డ్ పరిశీలనలు కూడా చేయాలని సూచించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ రవి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.