సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 4 , మల్లాపూర్ మండల రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : ముదిరాజ్ లు పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి అన్ని రంగాలలో ముందుకెళ్లాలని, రాజ్యాధికార వాటా కోసం పోరాడాలి అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు నెంబర్ స్థాయి నుండి జెడ్పిటిసి స్థాయి వరకు ముదిరాజులు పోటీ చేసి తమ సత్తా చాటాలని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు చిట్యాల లక్ష్మణ్ అన్నారు. సోమవారం ముదిరాజ్ మహాసభ గౌరవ జిల్లా అధ్యక్షులు డా.సత్యనారాయణ ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ ,రాఘవపేట్, ముత్యంపేట్, చిట్టాపూర్ గ్రామాలలోని ముదిరాజ్ సంఘాలతో ఆయన సమావేశాలను నిర్వహించి ముదిరాజులను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ఉపాధ్యక్షులు బోయిని హన్మాండ్లు, బోండ్ల రవి, మల్లాపూర్ ముదిరాజ్ యూత్ అధ్యక్షులు బొయిని శేఖర్, కుక్కదువ్వ మహేష్, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.