సాక్షి జీడీటల్ న్యూస్ 2 నవంబర్ 2025 రుద్రూరు మండలం నిజామాబాద్ జిల్లా(షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి) బోధన్ నుండి శబరిమలై వరకు అయ్యప్ప స్వాములు శనివారం మహాపాదయాత్ర నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప నినాధాలతో బోధన్ మీదుగా రుద్రూర్ గ్రామానికి చేరుకున్నారు. రుద్రూర్ లో అయ్యప్ప స్వాములకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప స్వాములకు పండ్లు పంపిణీ చేశారు. పాదయాత్ర చేసిన వారిలో దుర్కి చిన్న గంగారాం స్వామి, జుక్కల్ వార్ గంగాధర్ స్వామి, కోట్న లక్ష్మణ్ స్వామి, దాసరి శ్రీనివాస్ స్వామి, చెరుకుల నారాయణస్వామి, కంచోజు సత్యనారాయణ స్వాములు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పత్తి రాము, ప్రదీప్ సెట్, ఇందూర్ కార్తిక్, తోట సంగయ్య, పార్వతి మురళి తదితరులు పాల్గొన్నారు.