ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

*భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలి

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 2025 రిపోర్టర్ రాజు గద్వాల జిల్లా, దేశ సమగ్రతను కాపాడేందుకు అవిశ్రాంత కృషిచేసి ఉక్కుమనిషిగా పేరుగాంచిన దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని ఎమ్మెల్యే ఈ రోజు దేశ తొలి ఉప ప్రధానిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా గద్వాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ముఖ్యఅతిథిగా గా కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ జిల్లా ఎస్పీ శ్రీనివాసులు రావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఎస్పీ కార్యాలయం నందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జెండా ఊపి 2కే రన్ ర్యాలీని ప్రారంభించారుఎస్పీ కార్యాలయం నుంచి రైల్వే ఫ్లైఓవర్, అంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు 2కే రన్ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *