సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 (కరీంనగర్) రిపోర్టర్: సురేష్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల్ డ్రస్సెస్ షోరూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న షాపులకు కూడా మంటలు వ్యాపించగా, ఈ మంటల్లో బట్టల దుకాణంతో పాటు వినాయక ఎంటర్ప్రైజెస్, ఫొటోగ్రఫి షాపు, కెనాన్ ఫొటోగ్రఫి దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా కపిల్ దుకాణం యాజమాన్యానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.